Tuesday, 25 May 2021

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఆనందయ్య నాటు మందు.. యాక్టర్ జగపతి బాబు కామెంట్స్ వైరల్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో .. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు వేరే రాష్ట్రాల్లోనూ ఇదే హాట్ టాపిక్. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు, శాత్రవేత్తలకే అంతుచిక్కని కరోనా మహమ్మారి మందుతో తోకముడుస్తోందని నడుస్తున్న చర్చలు ఎల్లలు దాటుతున్నాయి. దీంతో అందరి చూపు కృష్ణపట్నం పైనే పడింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ జనం మాత్రం ఎగబడుతున్నారు. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఆనందయ్య నాటు మందు ముందర తేలిపోతోందని ప్రజలు అంటున్నారు. ఆనందయ్య నాటు వైద్యానికి జనం సపోర్ట్ బాగా లభిస్తోంది. వేల సంఖ్యలో జనం ఈ మందు కోసం ఎగబడుతున్నారు. సోషల్ మీడియాలో ఆనందయ్య నాటు మందు గురించిన పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయి నివేదిక‌లు వ‌చ్చే వ‌రకు ప్ర‌భుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ నటుడు రియాక్ట్ అవుతూ ఆనంద‌య్య నాటు మందుపై ఆయ‌న‌ త‌న అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆనంద‌య్య గారి మందు శాస్త్రీయంగా అనుమ‌తి పొందుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. ''తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మనల్ని కాపాడేందుకు ప్రకృతి ముందుకొచ్చిన‌ట్లు అనిపిస్తోంది. ఆనంద‌య్య గారి మందు శాస్త్రీయంగా అనుమ‌తులు పొంది ఈ ప్ర‌పంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నా. అతన్ని దేవుడు ఆశీర్వ‌దించాలి'' అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆనందయ్యకు సపోర్ట్ చేస్తూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3unR61s
v

No comments:

Post a Comment