Saturday, 8 May 2021

గౌతమ్, సితారలకు అవే ఇష్టం.. కానీ ఆ విషయంలో పిల్లలతో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా.. ఓపెన్ అయిన నమ్రత

అమ్మ అనే మాటలో ఉండే తీయదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సృష్టికి మూలం అమ్మ. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఎదుగుదల చూస్తూ అదే తన ఆస్తి అని మురిసిపోయేది అమ్మ మాత్రమే. అయితే ఈ రోజు (మే 9) ‘మాతృదినోత్సవం’ సందర్భంగా మహేష్ బాబు సతీమణి, హీరోయిన్ శిరోద్కర్ ఓ మీడియాతో ముచ్చటిస్తూ తన బిడ్డలతో ఉన్న అనుబంధాల గురించి వివరించింది. ఓ వైపు సినిమాలు చేస్తూ మహేష్ బాబు బిజీగా ఉండగా.. ఆయన వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ నమ్రత అతనికి అండగా నిలుస్తుంటుంది. ఇక ఇద్దరికీ ఏ మాత్రం విరామ సమయం దొరికినా కొడుకు , కూతురు సితారలతో టూర్స్ వేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తుండటం వీళ్ల హ్యబీ. పిల్లలతో సరదాగా వేసిన ట్రిప్స్, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మహేష్ అభిమానులను హుషారెత్తిస్తుంటుంది నమ్రత. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పిల్లలిద్దరితో తాను ఎలా మెదులుతుంటాననే విషయమై నమ్రత స్పందించింది. పిల్లల కోసం పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పిన ఆమె.. వారి ఇష్టాయిష్టాలను గౌరవిస్తూనే మంచీ చెడు చెబుతుంటానని చెప్పింది. వీలైనంత నిరాడంబరంగా ఉండమని చెబుతూ మంచికి, చెడుకి తేడా చెబుతుంటా అని చెప్పుకొచ్చింది. ఏ పిల్లలూ అదే పనిగా చదువుకోవడానికి ఇష్టపడరని, అందుకే వాళ్లను చదివించేటప్పుడు మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటానని ఆమె తెలిపింది. చదువుతో పాటు పిల్లలకు ఆటలు కూడా ముఖ్యం అని చెప్పిన నమ్రత.. గౌతమ్‌కు స్విమ్మింగ్, సితారకు డ్యాన్స్‌ అంటే ఇష్టమని, వాటిని ఇద్దరూ ఎంజాయ్‌ చేస్తారని చెప్పింది. తన ఇద్దరు పిల్లలు బంగారం అంటూ మురిసిపోయిన ఆమె, వాళ్లను మ్యానేజ్‌ చేయడం తనకెప్పుడూ ఛాలెంజింగ్‌గా అనిపించలేదని చెప్పింది. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే సరదాగా గొడవపడడం కామన్‌ కదా! మా ఇంట్లో కూడా వీళ్ళిద్దరూ అంతే అని నమ్రత తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q4hvDu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...