ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వేలల్లో సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్, కర్ఫ్యూలు విధించారు. మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉంది. ఉదయం నాలుగైదు గంటలు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఆ తరువాత లాక్డౌన్, కర్ఫ్యూ అమల్లోకి వచ్చేస్తోంది. ఇలాంటి సమయాల్లో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అందరూ కుదేలువుతున్నారు. సెలెబ్రిటీలు అయితే షూటింగ్లు క్యాన్సిల్స్ చేసుకుని మరీ ఇంట్లోనే ఉంటున్నారు. మామూలుగానే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఇలాంటి సమయంలో ఇంకెంత హల్చల్ చేస్తుంటుందో ఊహించుకోవచ్చు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్లా ఆమె చేసే కామెంట్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా అనసూయ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అనసూయ ఫేస్ బుక్లో ఓ ఆట ఆడారు. ఆన్ లైన్ షాపింగ్ అంటే ఇష్టమా? లేదా ఇన్ పర్సన్ షాపింగ్ అంటే ఇష్టమా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి అనసూయ స్పందిస్తూ.. తన ఆవేదనను బయటపెట్టేశారు. ఆన్ లైన్ షాపింగ్ అంటే నచ్చదని, తనకు ఎప్పుడూ కూడా ఇన్ పర్సన్ షాపింగ్ అంటేనే ఇష్టమని, కానీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను అంటూ అనసూయ ఏడుస్తూ చెప్పేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uV6OlU
v
No comments:
Post a Comment