యాంకర్ .. ఈ పేరు తెలియని ప్రేక్షకుడు ఉండనే ఉండడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు బుల్లితెరను మహారాణిలా ఏలుతూ మాటల గారడి చేసింది ఈ యాంకర్. కుర్రకారును ఓ ఊపు ఊపేస్తూ చలాకీగా చిందులేసి ఫుల్ పాపులారిటీ సంపాదించింది. తెలంగాణ యాసలో బుల్లితెరపై అదరగొట్టిన ఆమె.. వెండితెరపై కూడా సత్తా చాటింది. పలు సినిమాల్లో నటించడమే గాక ఐటెం నెంబర్స్తో ఉర్రూతలూగించింది. అయితే అందరిలాగే ఉదయభానుపై కూడా అప్పట్లో కొన్ని రూమర్స్ షికారు చేశాయి. ఈ మధ్య తరచూ రకరకాల వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ''పూలరంగడు, అహ నా పెళ్లంట'' చిత్రాల దర్శకుడు , ఉదయభాను గురించిన వార్తలు బాగా వైరల్ కావడంతో చర్చలు నడిచాయి. అప్పుడే ఆ వార్తలను ఉదయభాను ఖండిస్తూ అవన్నీ రూమర్స్, అందులో నిజం లేదని తేల్చిచెప్పింది. అయితే ఇప్పుడు అదే విషయమై తాజా ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు డైరెక్టర్ వీరభద్రం. అప్పట్లో మీపై వచ్చిన వార్తల గురించి ఏమంటారని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ''ఎవరైనా సరే పండ్లున్న చెట్లపైనే రాళ్లు వేస్తారు. అలాగే నేను కూడా అప్పట్లో వరుసగా హిట్ సినిమాలు తీసేసరికి కావాలని నాపై అలాంటి రూమర్స్ క్రియేట్ చేశారు. నిజానికి ఉదయభానును నేనెప్పుడూ కలవలేదు. టీవీలో చూడటం తప్పితే ఆమెను కలిసిన సందర్భమే లేదు. ఎందుకు అలాంటి వార్తలు స్ప్రెడ్ చేశారో ఇప్పటికీ అర్థం కాదు. నేను దర్శకుడిగా బిజీగా ఉండడం వల్ల అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే'' అన్నారు వీరభద్రం. ఈవీవీ సత్యనారాయణ, తేజ లాంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన వీరభద్ర చౌదరి చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చిన్న బడ్జెట్ లోనే కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పట్లో ఉదయ్ కిరణ్తో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన ఆయన కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ తర్వాత నాగార్జునతో 'భాయ్' సినిమా చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b2HHWf
v
No comments:
Post a Comment