Saturday, 1 May 2021

కరోనాను జయించిన చిరు హీరోయిన్.. ఇలా చేస్తే త్వరగా కోలుకోవచ్చు అంటూ అభిమానులకు సూచన

రెండో దశలో ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది వైరస్ బారినపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన , ఆమె భర్త ఆక్షయ్ వార్దేతో పాటు పిల్లలకు కూడా కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆమె వైద్యుల సూచన మేరకు తగిన చికిత్స తీసుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సమీరా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆమె స్వల్ప అనారోగ్యంతో ఉన్నానని పేర్కొంది. ఇందుకోసం యోగా, వాకింగ్ చేయడం ద్వారా మళ్లీ శక్తి పుంజుకొనే ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించింది. ‘‘నా కుటుంబం సురక్షితంగా ఉందని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మరోవైపు ప్రతీ ఒక్కరు పడుతున్న కష్టాలు చూస్తుంటే మనస్సు తరుక్కుపోతుంది. గత రెండు నెలలుగా ఫిట్‌సెన్ ఫ్రైడేని పాటించడం ఈ కఠిన సమయంలో నాకు ఎంతో ఉపయోగపడింది. నిజంగా పిల్లలకు, నాకు, అక్షయ్‌ ఒకేసారి కరోనాతో పోరాడాల్సి రావడం ఎంతో కష్టంగా అనిపించింది’’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘‘నేను ఇంకా కొంత బలహీనంగానే ఉన్నాను. దాన్ని అధిగమించేందుకు యోగా, వాకింగ్ చేయడంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకుంటున్నాను. ప్రతీ ఒక్కరు కూడా వ్యాయామం చేయండి. మన ఇంట్లో చేసే సింపుల్ వాకింగ్ కూడా మన స్టామినా పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వ్యతిరేక వార్తలను చూసి.. ఆగిపోవడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. హాయిగా నిద్రపోండి. ఇది ప్రతీ ఒక్కరు దృఢంగా ఉండాల్సిన సమయం. మీలో పాజిటివ్ శక్తిని పెంచుకోండి. జాగ్రత్తగా ఉండండి.. నాపై, నా కుటుంబంపై ప్రేమ చూపించిన మీ అందరికీ నేను రుణపడి ఉంటాను’’ అని ఆమె తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QLgvEC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...