Sunday, 2 May 2021

పవన్‌ కళ్యాణ్ సరసన నిత్యామీనన్‌.. ఆ హీరోయిన్ కాదనడంతో అమ్మడికి బంపర్ ఆఫర్!

ఇటీవలే 'వకీల్ సాబ్' సినిమాతో గ్రాండ్ రీ- ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో ఒక్క క్షణం తీరికలేకుండా గడుపుతున్న ఆయన.. ప్రస్తుతం మలయాళ సూపర్‌హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. సాగర్‌. కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే దానిపై ఆసక్తికర వార్త బయటకొచ్చింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ రూపొందుతోంది. చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాలో రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ జోడీగా సాయి పల్లవిని తీసుకోవాలని ప్లాన్ చేయగా డేట్స్ అడ్జస్ట్ కాక ఆమె ఓకే చేయలేదని తెలిసింది. దీంతో ఇప్పుడీ క్రేజీ ఛాన్స్ నిత్యామీనన్‌కి వెళ్లిందని సమాచారం. ఇప్పటికే నిత్యాతో సంప్రదింపులు కూడా ఫినిష్ చేశారట మేకర్స్. అయితే ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఇంకా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సెట్‌లో అడుగుపెట్టలేదట. ప్రస్తుతం కరోనా సెకెండ్‌ వేవ్‌ వల్ల ఈ మూవీ షూటింగ్ కొద్దిరోజుల పాటు నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడ్డాక పార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nIUXVk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...