Wednesday, 5 May 2021

కారులోనే వ్యాక్సినేషన్.. ప్రభుత్వాలకు నమ్రత శిరోద్కర్ సూచన

ప్రస్తుతం మన దేశంలో కరోనా తీవ్రత ఎలా ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు కరోనా దాడి చేస్తుంటే ఆక్సిజన్ లేక, వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. ముందుగా 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. ఇక మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమం ప్రారంభించింది. అయితే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్ కొరత ఉందన్న విషయం తెలిసిందే. కొందరికి మొదటి డోస్ వేసేశారు. ఇంకొందరు రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు వ్యాక్సినేషన్ వేయడం కష్టతరంగా మారింది. ఇలాంటి వారి కోసం ముంబై, భోపాల్ వంటిప్రదేశాల్లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. వారు ఉన్న చోటకు వెళ్లి, కారులోనే ఉన్నా కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు. భోపాల్, మధ్య ప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. ఎంతో మంచి నిర్ణయమది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు కారులోనే వ్యాక్సిన్ వేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కష్టకాలం నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి అని నమత్ర కోరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vITUYe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...