Saturday, 1 May 2021

కీలక నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్.. తన సూపర్‌హిట్ సినిమా పేరుతో డిజిటల్ రంగంలోకి ఎంట్రీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన విలక్షణమైన నటనతో అభిమానులను అలరించింది కంగనా. ఇప్పుడు తన కెరీర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన కంగనా.. త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. తన సూపర్‌హిట్ చిత్రం ‘’ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ ప్రారంభించిన ఆమె.. ‘టికు వెడ్స్ షెరు’ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించింది. తొలి దశ స్వతంత్ర పోరాట యోధురాలు ‘ఝాన్సీ లక్షీభాయ్’ జీవితగాధ ఆధారంగా ‘మణికర్ణిక’ రూపొందించారు. తొలుత దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. అయితే కొన్ని విభేదాల కారణంగా క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోగా.. కంగనానే మిగితా సినిమాను డైరెక్ట్ చేసింది. ఈ సినిమాకి కంగనాకు నేషనల్ అవార్డు కూడా లభించింది. దీంతో తనకు కలిసి వచ్చిన ‘మణికర్ణక’ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను కంగనా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ లోగోను శనివారం ఆమె ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమకు ఆశీర్వదించాలని ఆమె కోరింది. ‘‘టికు వెడ్స్ షెరు సినిమాతో మణికర్ణిక ఫిలిమ్స్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఒక సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథ. కొత్త రకం వినోదాన్ని ఈ సినిమా ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాక, మా ప్రొడక్షన్ సంస్థ నుంచి కొత్త టాలెంట్‌ని, కొత్త కాన్సెప్ట్‌లని పరిచయం చేస్తాము. సాధారణ సినిమాలు చూసే ప్రేక్షకుల కంటే.. డిజిటల్ సినిమాలు చూసే ప్రేక్షకులు కాస్త పరిణితి చెందిన వాళ్లు అని మా భావన’’ అని కంగనా తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nG3W9M
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...