Sunday, 4 April 2021

Vakeel Saab: ఆ క్షణం కోసం ఎంతో ఎదురుచూశాను కానీ..! మిస్ అవుతున్నా.. నివేదా ఎమోషనల్ ట్వీట్

'అజ్ఞాతవాసి' చిత్రం తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన పవర్ స్టార్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘’ సినిమాతో పవన్ మళ్లీ వెండి తెరపై కనిపించనున్నాడు. అయితే సినిమా విడుదలకు ముందే చిత్ర యూనిట్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లింది. ఈ విషయాన్ని నివేదా స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే కరోనా సోకడంతో తాను ఈ రోజు (ఏప్రిల్ 4) జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని.. నివేదా విచారం వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులను కలిసే క్షణం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూశానని.. కానీ అది ఇప్పుడు కుదరడం లేదని ఆమె బాధపడింది. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్తున్న అభిమానులు కచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించింది. ఈ 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ మీ అందరి కోసమే అని నివేదా పేర్కొంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్స్ బ్యానర్లపై ఈ సినిమాని దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31JuHzE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...