దేశంలో సెకండ్ వేవ్ భయంకరంగా ఉంది. మహమ్మారి వైరస్ బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సినీ ఇండీస్ట్రీలో కరోనా గుబులు మొదలైంది. పలువురు సినీ నటులు కరోనాబారిన పడుతుండటం కలవరపెడుతోంది. గతేడాది కరోనా కారణంగా ఎందరో సినీ ప్రముఖులు మరణించారు. ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిన్న (మంగళవారం) ప్రముఖ సినీ నిర్మాత (చిట్టీ నాగేశ్వరరావు) కోవిడ్ కారణంగా కన్నుమూయడంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. CN రావు మరణవార్త తెలిసి పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. తెలుగులో ''మా సిరిమల్లే, అమ్మ నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ'' అలాగే తమిళ్లో ఊరగా అనే సినిమాలు నిర్మించారు CN రావు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా, తెలుగు చలన చిత్ర నిర్మాతల సెక్టార్కి సెక్రెటరీగా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్గా, ఎక్స్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్గా ఆయన సేవలందించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n5d47m
v
No comments:
Post a Comment