Sunday, 11 April 2021

సరిగ్గా అదే టైంలో నాకు కరోనా వచ్చింది.. దాంతో ఆగిపోయాను.. లేకుంటేనా.. నివేదా థామస్

తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో కీలక పాత్రలో నివేదా నటించింది. ఈ సినిమా సాధిస్తున్న విజయం పట్ల తన సంతోషాన్ని తెలిపింది. ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమవడం గర్వంగా ఉందని చెప్పింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించిన తన అనుభవాలను ఇంటర్వ్యూ ద్వారా నివేదా వివరించింది. అయితే సినిమా విడుదలకు ముందే నివేదా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ కారణంగానే నివేదా వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కానీ, ఆ తర్వాత నిర్వహించిన ప్రమోషన్స్‌లో కానీ పాల్గొనలేదు. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిన నివేదా.. వైద్యుల సూచించిన చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి కోలుకుంది. అయితే సరిగ్గా సినిమా విడుదలకు ముందు తనకు కరోనా వచ్చిందని లేకుంటే థియేటర్‌లో ఆడియన్స్‌తో కలిసి సినిమా చూసేదాన్నని నివేదా చెప్పింది. ‘‘కరెక్ట్‌గా ప్రమోషన్ టైమ్‌లో నాకు కొవిడ్ రావడం కొంత బాధగా అనిపించింది. అయితే రైట్ టైమ్‌కు నాకు మళ్లీ నెగిటివ్ వచ్చింది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నాను. ఎప్పటిలా ఆరోగ్యంగా కావాలంటే బయట తిరగకుండా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆగిపోయాను. నాకు మాత్రం ఒక్కసారి బయటకు వెళ్లి థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలని ఉంది’’ అని నివేదా పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g0s3Om
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...