వివాదాల దర్శకుడు తరచూ పవన్ కళ్యాణ్పైన.. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు, లోకేష్లపై సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేస్తుంటారు. అయితే వర్మ మరో అడుగు ముందుకు వీళ్లని టార్గెట్ చేస్తూ ఏకంగా సినిమాలు తీసేశాడు. చంద్రబాబు, , లోకేష్ బాబులను పోలిన పాత్రలలో వాళ్ల క్యారెక్టర్స్ని అపహాస్యం చేస్తూ సినిమాలు తీసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డిని కానీ.. ఆయన ప్రభుత్వాన్ని గాని వర్మ విమర్శించిన సందర్భాలు లేవు.. ట్వీట్లు లేవు. సెటైర్లు వేయడంలో తారతమ్యాలు లేవని.. పార్టీ అభిమానాలు.. వ్యక్తిగత ఇష్టాలు లేవని చెప్పే వర్మ.. జగన్ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారనే ప్రశ్నలు.. సినీ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ‘ఏమయ్యా వర్మా.. పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని వారి పార్టీలనే విమర్శిస్తావ్.. జగన్కి ఎందుకు మినహాయింపు’? అంటే.. తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు వర్మ. ‘నాకు వాళ్లు వీళ్లు అని కాదు.. ఎక్కడ డ్రామా ఎక్కువ ఉందో దాన్ని ఉద్దేశించి ట్వీట్లు చేస్తుంటా.. పొలిటికల్ ట్వీట్లు పెట్టను.. ఇంట్రస్టింగ్ మేనర్లోనే ట్వీట్లు చేస్తుంటా. అలాంటి డ్రామాలు జగన్ దగ్గర లేవు అందుకే ట్వీట్లు పెట్టడం లేదు. ఎన్టీ రామారావుగారు వైశ్రాయ్ హోటల్కి సంబంధించిన ఘటన నాకు ఇంట్రస్టింగ్గా అనిపించింది.. అది టీడీపీ గురించి కాదు.. వ్యక్తి గురించి ఇంట్రస్ట్ అంతే. అందుకే ఆ విషయాన్ని నా సినిమాలో చూపించా’ అని చెప్పారు వర్మ. సర్లేకానీ.. పొలిటికల్గా ట్వీట్లు చేస్తుంటారు కదా.. మీరే ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తారు అని వర్మని ప్రశ్నించగా.. ‘బేసిక్గా సీఎం కావడం అంటే ప్రజల్ని ఉద్దరించాలి.. మంచి చేయాలి.. అది చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి సుబ్బరంగా ఆ ఒక్కరోజు నిద్రపోతా’ అని చెప్పారు వర్మ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3v8gdWU
v
No comments:
Post a Comment