Friday, 16 April 2021

‘జాతిరత్నాలు’ చూసిన భారత క్రికెటర్.. ‘అలా చేయడం చాలా కష్టం కానీ మీరు అదరగొట్టారు’ అంటూ కితాబు

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జాతి రత్నాలు’. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రొడ్యూసర్లకు కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే కలెక్షన్ల పరంగానే కాక.. ఈ సినిమాకు విమర్శకుల నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. మరోవైపు సినిమాపై పలువురు సినీ ప్రముఖలు ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఓటీటీలో విడుదల అయింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమాని టీం ఇండియా క్రికెటర్ చూశాడు. చూసిందే తడవుగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ట్వీట్ చేశాడు. ‘.. దేవుడా.. సినిమా పూర్తిగా నవ్వుల ప్రయాణమే. చూసిన ప్రతీ సీన్ నవ్వు తెప్పించింది. డైలాగులు, డైరెక్షన్‌తో పాటు ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటించారు. ఇలాంటి జానర్‌లో ఓ సినిమాను చేయడం చాలా కష్టం కానీ మీరు చాలా సునాయాసంగా చేశారు. అదరగొట్టారు. మీరు ఇంతే శక్తితో కొనసాగాలి’ అంటూ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sp9NB0
v

No comments:

Post a Comment