Tuesday, 13 April 2021

ప్రముఖ గాయకుడికి పితృవియోగం.. కరోనానే కారణం.. భావోద్వేగ పోస్ట్..

ప్రముఖ గాయకుడు, హిందీ రాప్ మెగాస్టార్‌గా పేరు సంపాదించుకున్న బాబా సెహగల్‌కు పితృ వియోగం జరిగింది. వైరస్ సోకడంతో తండ్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. జీవితంలో ఎన్నో అవరోధాలతో పోరాడిన తన తండ్రి ప్రాణాలు కోల్పోయారని ఆయన భావోద్వేగంగా పోస్ట్ పెట్టారు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించాలని కోరిన బాబా.. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన తన తండ్రికి కరోనా సోకిందని కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘లఖ్‌నవులోని నా సోదరి వద్ద నా తండ్రి నివసిస్తున్నారు. కరోనా సోకడంతో ఆయన గత ఎనిమిది రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే సోమవారం రాత్రి ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయం కూడా లేదు. అప్పటికీ ఓ అంబులెన్స్ ద్వారా ఆయన్ని ఆస్పత్రికి తరలించాము.. కానీ అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవు. అంతేకాక.. కొత్త రోగుల కోసం బెడ్లు, వెంటిలేటర్లు కూడా లేవు. ఒకవేళ అవి అందుబాటులో ఉండి ఉంటే మా నాన్న బ్రతికేవారు’’ అని బాబా అన్నారు. బాబా సెహగల్ తొలి ఆల్బమ్ ‘దిల్‌రుబా’ 1990లో విడుదల అయింది. ఆ తర్వాత 1992లో విడుదలైన ‘థండా థండా పాని’ అనే ఆల్బమ్ ద్వారా ఆయన మరింత ఫేమస్ అయ్యారు. 1998లో ‘మిస్ 420’ అనే సినిమా ద్వారా ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2005లో అనుష్క హీరోయిన్‌గా నటించిన విడుదలైన ‘రుద్రమదేవీ’ అనే సినిమా ద్వారా ఆయన టాలీవుడ్‌లో ఆరంగేట్రం చేశారు. అంతేకాక హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత వ్యవహరించే బిగ్‌బాస్ షో మొదటి సీజన్‌లో ఆయన పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a9ScH0
v

No comments:

Post a Comment