ఒకప్పుడు వెండి తెరపై మెరిసి.. తెలుగు బుల్లితెరపైకి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ . హీరోయిన్గా తన గ్లామర్తో కుర్రకారుకి చెమటలు పట్టించిన ఆమె.. ఇప్పుడు ఓ ప్రముఖ కామెడీ షోకి జడ్జిగా ఉంటూ నవ్వులు పంచుతున్నారు. తన కెరీర్లో ఎన్నో సూపర్హిట్లు అందుకున్న ఆమె , ఆమని వంటి అప్పటి స్టార్ హీరోయిన్లతో కలిసి పని చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె నటి సౌందర్యతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న సౌందర్య.. అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె మరణంతో అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే సౌందర్య మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఇంద్రజ అన్నారు. తాను హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే సమయానికే సౌందర్య టాప్ హీరోయిన్ స్థానంలో ఉన్నారని ఆమె చెప్పారు. ‘‘నేను సౌందర్యగారితో కలిసి నటించే సమయానికే ఆమె పెద్ద హీరోయిన్. కానీ, ఎప్పుడూ ఆమెలో ఆ భావం కనిపించలేదు. సెట్స్లో అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండేది. స్కిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు సూచనలు చేసేది. నిజంగా ఆమె చాలా మంచి వ్యక్తి. నా జీవితంలో ఎప్పటికీ నమ్మలేని నిజం ఏదైనా ఉందంటే అది సౌందర్య మరణమే. అది ‘కల’ అయితే బాగుండు అని చాలాసార్లు అనిపించింది’’ అని ఇంద్రజ అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3v3z8lE
v
No comments:
Post a Comment