Friday, 9 April 2021

నాకున్నవి మూడే మూడు కోరికలు.. అవి త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నా: కృతి సనన్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘1: నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి . అయితే ఈ సినిమా ఊహించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచెయ్’ అనే సినిమాలో ఈ బ్యూటీ నటించగా.. అదీ డిజాస్టర్ అయింది. దీంతో టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి.. మెరుగైన కెరీర్ కోసం బాలీవుడ్‌ గడపతొక్కింది కృతి. అక్కడ ఈ భామకి అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులోలా కాకుండా అక్కడ కాస్త సక్సెస్‌ను రుచి చూసింది ఈ బ్యూటీ. దీంతో ఇక బాలీవుడ్‌ని వదలకుండా.. అక్కడే పెద్ద సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేస్తూ.. కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటుంది కృతి సనన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు అతి ముఖ్యమైన మూడు కోరికలను బయటపెట్టింది కృతి. ‘‘మొదటి కోరిక ఒక పెద్ద బంగ్లా.. అందులో పెద్ద గార్డెన్.. అక్కడ కూర్చొని హాయిగా టీ తాగుతూ సేదతీరాలి. రెండో కోరిక స్కై డేవింగ్ చేసి.. మాజాని ఆస్వాదించాలి. మూడోది ఓ జాతియస్థాయి పురస్కారం అందుకోవాలి. ఓ ప్రముఖ వ్యక్తి బయోపిక్‌లో నటించాలి. ఈ కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని కృతి తెలిపింది. ప్రస్తుతం కృతి సనన్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘’, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘అదిపురుష్’ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘బేడియా’ అనే సినిమాలో కూడా కృతి హీరోయిన్‌గా చేస్తోంది. కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మీమి’ అనే సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదలని వాయిదా వేశారు. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fU7147
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...