Sunday, 25 April 2021

పెండింగ్‌‌లో ఆ పని.. చేయమంటారా? వద్దా?.. నేరుగా అడిగేసిన రష్మిక

టాలీవుడ్ బ్యూటీ తెరపై ఎంత సరదాగా ఉంటారో.. సోషల్ మీడియాలో తన అభిమానులతో అంతే సరదాగా ఉంటారు. సినిమాల్లో రష్మిక చేసే అల్లరి కంటే సోషల్ మీడియాలో చేసే సందడి ఎక్కువగా ఉంటుంది. వెరైటీ ఫోటో షూట్లు నిత్యం అభిమానులను అలరిస్తూ ఉంటారు. అలాంటి రష్మికకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమాలు ఎక్కువగా చేయకపోయినా కూడా నేషనల్ క్రష్‌గా అవతరించడానికి ఆ అల్లరే కారణం. పేరుకే రష్మిక కన్నడ భామ. కానీ పాపులారటీ వచ్చింది, ఇచ్చింది మాత్రం టాలీవుడ్. ఇప్పుడు రష్మిక మందాన్న కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీల్లో పాగా వేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ కోలీవుడ్‌లో కార్తీ హీరోగా వచ్చిన సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. సుల్తాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో రష్మిక కాస్త డల్ అయ్యారు. అయితే రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను కొట్టేస్తున్నారు. ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక తన అభిమానులను అంతగా పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఈ మధ్య తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టడం లేదు. ఈ విషయమై ఎన్నోసార్లు అభిమానులు రష్మికకు విన్నవించుకున్నారు. లైవ్ సెషన్ పెట్టండి అంటూ అభిమానులు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తుంటారు. ఇక రష్మికకు ఇన్నాళ్లకు తీరిక దొరికినట్టుంది. అసలే ఇప్పుడు రష్మిక మందాన్న సినిమాలతో పాటుగా యాడ్స్‌లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. సంతూర్ యాడ్, కేఎఫ్‌సీ చికెన్ అంటూ ప్రకటనలతోనూ బాగానే సంపాదిస్తున్నారు. అలాంటి రష్మిక తాజాగా తన అభిమానులతో ముచ్చటించేందుకు రెడీ అవుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. లైవ్‌కు వస్తానని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.. అది చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది.. ఇప్పుడు లైవ్‌లొకి రమ్మంటారా? మీరేం అనుకుంటున్నారు? లైవ్‌లోకి రావాలా? వద్దా? చెప్పండి అని నేరుగా తన అభిమానులను అడిగేశారు రష్మిక. అయితే చాలా మంది మాత్రం రావాలని కోరుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sKYnaZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...