Thursday, 22 April 2021

కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి.. షాక్‌లో ఇండస్ట్రీ.. సంతాపం తెలిపిన ప్రముఖులు

లక్షలాది మంది ప్రాణాలు బలి తీసుకుంటున్న ప్రస్తుతం భారతదేశంలో రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. కొన్ని నెలల క్రితం కరోనా ఉదృతి కాస్త తగ్గినట్లే అనిపించడంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ జనజీవనం యధావిధిగా సాగడం ప్రారంభమైంది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు.. కానీ, కరోనా ఇంకా ఏదో మూల నక్కి ఉందనే విషయాన్ని మర్చిపోయారు. నిర్లక్ష్యంగా మాస్కులు ధరించకుండా తిరగడం.. గుంపుల్లో ఉండటం.. ఇలాంటివి చేయడంతో కరోనా మరోసారి విజృంభించింది. రెండో దశలో మహమ్మారి వ్యాప్తి దారుణంగా ఉంది. కాస్త జాగ్రత్త పాటించకపోయినా సరే.. వెంటనే వైరస్ అంటుకుంటోంది. ప్రతీ రోజు నమోదయ్యే కేసుల సంఖ్య ప్రస్తుతం మూడు లక్షలు దాటిపోయింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈసారి ఈ వైరస్ ప్రభావం సినీ ప్రముఖులపై ఎక్కువగానే ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రతీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. వారిలో సరైన చికిత్స అందుకొని.. రోగ నిరోధక శక్తి బలంగా ఉన్న వారు కోలుకుంటున్నారు. అయితే తాజాగా కరోనా బారిన పడి శాండల్‌వుడ్‌కి చెందిన ప్రముఖ పోస్టర్ డిజైనర్, దర్శకుడు మస్తాన్(63) ప్రాణాలు కోల్పోయారు. గత 40 సంవత్సరాలుగా శాండల్‌వుడ్‌లో పోస్టర్ డిజైనర్‌గా ఉన్నారు. దాదాపు రెండు వేల సినిమాలకుపైగా ఆయన పోస్టర్ డిజైనర్‌గా పని చేశారు. దీంతో పాటు శుక్లాంబరధరం, కల్లేశీ మల్లేశీ, సితార తదితర సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో హెసరఘట్టలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారు. మస్తాన్ మృతితో శాండల్‌వుడ్ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eC72rh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...