Tuesday, 13 April 2021

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. సంబరాల్లో ఇద్దరు హీరోలు.. ఆసక్తికర పోస్టర్‌ విడుదల

‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘’. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు యోధులు అల్లూరి సీతరామ రాజు, కొమరం భీమ్‌లు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతరామ రాజుగా మెగా పవర్‌స్టార్ , కొమరం భీమ్‌గా యంగ్‌ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్‌లుక్‌ల ద్వారా సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చిన్న ట్రయల్ ఇచ్చాడు జక్కన్న. ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. చరణ్, తారక్ ఇద్దరు కలిసిన ఓ ఆసక్తికర పోస్టర్‌ని విడుదల చేస్తూ పండుగ శుభాకాంక్షలు చెప్పింది టీమ్. ఈ పోస్టర్‌లో ప్రజలు హీరోలు ఇద్దరిని అమితమైన సంతోషంతో.. గాల్లోకి ఎగురవేస్తున్నారు. ఓ పండుగ వాతావరణంలో ఇది జరిగిట్లుగా పోస్టర్‌ని గమనిస్తే.. మనకు అర్థం అవుతుంది. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌కి హీరోయిన్‌గా ఆలియా భట్, తారక్ సరసన హీరోయిన్‌గా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. సముద్రఖని, అజయ్ దేవ్‌గన్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3teJEGg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...