Monday, 26 April 2021

కరోనాతో ప్రముఖ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ కన్నుమూత

దేశంలో కరోనా ఉదృతి రోజురోజుకూ రెట్టింపవుతోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదు కావడం, వేలల్లో కరోనా మరణాలు చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిలో గుబులు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌‌తో మరోసారి సినీ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చాలామంది సినీ నటులు కరోనా బారినపడగా.. నేడు టాలీవుడ్ దర్శకుడు, రచయత ఎన్. (ఎన్. వర ప్రసాద్) కోవిడ్ -19తో మరణించారు. కరోనా కారణంగా కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న సాయి బాలాజీ ప్రసాద్ హైదరాబాద్, గచ్చ్చిబౌలి లోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 57 సంవత్సరాలు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు సాయి బాలాజీ ప్రసాద్. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నాగబాబు గారు అంజనా ప్రోడ్సక్షన్స్ పతాకంపై నిర్మించిన 'బావగారు బాగున్నారా' చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో సాయి బాలాజీ ప్రసాద్ ఒకరు. ఆయన స్వస్థలం తిరుపతి. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి దర్శకుడిగా ఎదిగారు. సాయి బాలాజీ ప్రసాద్‌కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినిమా, టీవీ రంగాలకు చెందిన నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dTkR56
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...