Tuesday, 27 April 2021

ఆ సినిమా వచ్చి అప్పుడే 20 ఏళ్లయిందా..? హీరోయిన్ భూమిక షాకింగ్ రియాక్షన్..

‘’.. తెలుగు సినిమా ప్రేక్షకులను ఓ ఊపుఊపేసిన సినిమా. పవన్‌కళ్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పటికీ.. ఇప్పటికీ ఓ క్లాసిక్ అనే చెప్పుకోవాలి. ఎస్‌జే సూర్య డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకి ఏ.ఎమ్.రత్నం నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్ రేంజ్ వేరే లెవల్‌కు వెళ్లిపోయింది. మరోవైపు భూమికకి కూడా ఈ సినిమా ద్వారా స్టార్ డమ్ లభించింది. మ్యూజిక్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ ఇలా అన్ని కలగలిసిన ఈ సినిమాని ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. ఈ సినిమాకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ‘ఖుషి’ ఇంటర్వెల్ సీన్‌కి ఉన్న ఫ్యాన్ బేసే వేరు. పలు ఈవెంట్లలో, టీవీ షోలలో ఈ సీన్‌పై స్పూఫ్‌లు చేస్తుంటారు. చేసిన ప్రతీసారి అదే రేంజ్ రియాక్షన్ ప్రేక్షకుల నుంచి వస్తుంది. అంతలా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులపై ప్రభావం చూపింది. అయితే ఈ సినిమా విడుదలై మంగళవారానికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. అయితే ఖుషి 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంపై హీరోయిన్ భూమిక స్పందించింది. సినిమా గురించి భూమిక మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన సినిమాల్లో నాకు ఖుషి అంటే ఎంతో ఇష్టం. అసలు సినిమా పూర్తై 20 ఏళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నా. ఆ సినిమాకు నాకు ఉత్తమ నటిగా అవార్డు కూడా వచ్చింది. అందుకే అది నాకు ఎంతో ప్రత్యేకం. పవన్ పోషించిన ‘సిద్ధూ’, నా పాత్ర ‘మధు’ అంటే ప్రేక్షకులు ఇప్పటికీ ఇష్టపడతారు. అమ్మయే సన్నగా, చెలియా చెలియా పాటలు అంటే నాకు ఇష్టం. ఇంతకాలమైన సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారంటే.. నాకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32UPGjE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...