Tuesday, 9 March 2021

‘శ్రీకారం’ సినిమాకు అండగా ఉంటాం: వినోదపు పన్ను మినహాయింపుపై కేటీఆర్

ఆధునిక వ్యవసాయం గురించి తెలియజేస్తూ సేద్యాన్ని ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవాలో చెబుతూ ఒక సోషల్ మెసేజ్‌తో నిర్మించిన కమర్షియల్ చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్ హీరోగా నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా కిషోర్ బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా రెండు చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. మార్చి 8న ఖమ్మంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరవగా.. 9న హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ద‌ర్శకులు హ‌రీష్ శంక‌ర్‌, ప‌ర‌శురాం, నిర్మాత‌ అనిల్ సుంకర, హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, నార్ల శ్రీనివాస్ రెడ్డి, రైటర్ సాయి మాధవ్ బుర్రా, డీఓపీ యువరాజ్, పాటల రచయిత భరద్వాజ తదిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘చాలా సందర్భాల్లో చాలా రకాల ఈవెంట్లకు వెళ్తుంటాం. కానీ కొన్నింటికి వెళ్లినప్పుడే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అలా ఇప్పుడు అనిపిస్తోంది. ‘శ్రీకారం’ ట్రైలర్ చూశాను.. ఆ తరువాత 9 నిమిషాల వీడియో చూశాను. హృద‌యంతో ఈ సినిమాను నిర్మించారు. కిషోర్ ఎంత సింపుల్‌గా కనిపిస్తున్నాడో.. శర్వానంద్ కూడా అంతే సింపుల్‌గా ఉన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు! అని అంటారు. వ్యవసాయంలోనే వ్యయం ఉంది, సాయం ఉంది. ఇప్పుడు వ్యయం పెరిగింది.. సాయం తగ్గింది.. రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. షార్ట్ ఫిలిం తీస్తే ఫీచర్ ఫిల్మ్‌గా తీసే అవకాశం ఇచ్చారన్న నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి. మంచి సినిమాతో పాటు సందేశం ఇవ్వాలంటే కుదరదు. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. అందరికీ నచ్చేలా సినిమా తీయడం అంటే కత్తి మీద సాము లాంటిది. అయితే ఈ సినిమాను బాగానే తీశారని అనిపిస్తోంది. బాగుందని చెప్పాలంటే సినిమా మొత్తం చూడాల్సిన పని లేదు. అన్నం ఉడికిందో లేదో అని ఒక మెతుకు పట్టుకుని చెప్పినట్టు.. ట్రైలర్ చూస్తేనే సినిమా బాగా తీశారని చెప్పవచ్చు. రావు రమేష్ గారికి నేను అభిమానిని. ఆయన తండ్రి రావు గోపాల్ రావు గారంటే ఎంతో అభిమానం. రావు రమేష్, శర్వా మొదటి చిత్రం ‘గమ్యం’.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత చేసిన చిత్రం ‘శ్రీకారం’.. ఇదో విడ్డూరం. శర్వానంద్ ఎన్నో రకాల చిత్రాలను చేస్తుంటారు. డిఫరెంట్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. మంచి ప్రయత్నాలు, మంచి సినిమాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అండగా ఉంటాం. హ‌రీష్ చెప్పిన‌ట్టు ఎంటర్‌టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు నా వంతుగా ప్రయత్నిస్తాను. మంచి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరించాలి. పైరసీ లేకుండా థియేటర్లోనే సినిమాను చూడండి’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l1ZPna
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...