Tuesday, 2 March 2021

పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి.. క్రేజీ ఆఫర్ వదులుకున్న 'ఫిదా' బ్యూటీ!

రీ- ఎంట్రీ తర్వాత జోష్ పెంచారు . ఓ వైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన.. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో పాటు దగ్గుబాటి రానాతో కలిసి మలయాళీ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా సాయి ప‌ల్ల‌విని సెలెక్ట్ చేసిన‌ట్లు విన్నాం. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ క్రేజీ ఆఫర్‌ను వదులుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా తన డేట్స్ పవన్ సినిమాకు కేటాయించడం కష్టమని చెప్పిందట. బాగా ఆలోచించి చివరగా కుదరదని చెప్పి ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక ఈ సినిమాలో తన పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉందని ఆమె భావించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మరో హీరోయిన్ వేట ప్రారంభించారట దర్శక నిర్మాతలు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ రూపొందుతోంది. చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్‌‌కి స్కోప్ ఉన్న ఈ కథలో రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. పవన్ సరసన సాయి పల్లవి అనుకున్నారు కానీ ఇప్పుడామె తప్పుకుందని తెలుస్తోంది. సో.. చూడాలి మరి ఫిదా బ్యూటీ మిస్ చేసుకున్న ఈ ఛాన్స్ ఏ హీరోయిన్‌కి దక్కుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r99avw
v

No comments:

Post a Comment