Monday, 22 February 2021

చిరంజీవి కొత్త ప్రాజెక్ట్.. నయన్ తప్పుకోవడంతో త్రిష రెడీ! ఛాన్స్ మిస్ కాకూడదని ఫిక్స్

మెగాస్టార్ సరసన నటించే అవకాశం రావడమే ఓ గొప్ప వరంగా ఫీలవుతుంటారు హీరోయిన్లు. మెగా ప్రాజెక్టుల్లో భాగం కావడం వల్ల తమ పాపులారిటీ రెట్టింపవుతుందని ఆశ పడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వస్తుంటుంది. తాజాగా అలాంటి ఓ కారణం వల్లనే చిరంజీవి చేయనున్న కొత్త ప్రాజెక్టు నుంచి నయనతార తప్పుకుందనే న్యూస్ వైరల్ అవుతోంది. చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనుండగా, తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి లాంచ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే అనుకోకుండా నయన్ తన డేట్స్ అందుబాటులో లేవని చెప్పడంతో త్రిషను సంప్రదించిందట చిత్రయూనిట్. ఈ ఛాన్స్ రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పిందని తెలుస్తోంది. చిరంజీవి ప్రెజెంట్ మూవీ 'ఆచార్య'లో నటించాలని అనుకున్న త్రిష, చివరి నిమిషం డ్రాప్ కావడంతో ఆమె స్థానంలో కాజల్ నటిస్తోంది. దీంతో ఈ సారైనా ఈ అవకాశాన్ని వదులుకోవద్దని బలంగా ఫిక్స్ అయిందట త్రిష. అతి త్వరలో లూసిఫెర్ రీమేక్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మొదట చిరంజీవి- త్రిషలపై సన్నివేశాల చిత్రీకరణనే జరుపుతారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kiy9K7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...