అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ‘నాంది’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. చిన్న సినిమాగా విడుదలైన ‘నాంది’ పెద్ద విజయమే అందుకుంది. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘నాంది’ టీమ్ను మీడియా సమక్షంలో అభినందించారు. అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ‘నాంది’ రీమేక్ రైట్స్ దిల్ రాజు కొనుగోలు చేశారట. నాలుగు భాషల్లో ఆయన ‘నాంది’ని రీమేక్ చేయబోతున్నారట. See Photos: ‘నాంది’ సినిమాను హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ చేసేందుకు హక్కుల నిమిత్తం రూ. 2.75 కోట్లు దిల్ రాజు చెల్లించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో దిల్ రాజు చేతులు కలిపారని అంటున్నారు. మరోవైపు, ‘నాంది’ బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు రూ. 5.28 కోట్ల షేర్ వసూలు చేసిందని సమాచారం. మరికొద్ది రోజుల్లో ‘నాంది’ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను ‘ఆహా’ రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసిందట. కాగా, ‘నాంది’ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎస్వి2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 19న విడులైన ఈ చిత్రంలో నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్.నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. అబ్బూరి రవి డైలాగులు రాశారు. సిద్ సినిమాటోగ్రఫీ అందించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3syNo4D
v
No comments:
Post a Comment