మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే చాలు చిరంజీవి అండగా నిలబడతారు. తనకు చేతనైనంత సాయం చేస్తారు. ఆ మధ్య గుంటూరుకు చెందిన రాజనాల వెంకట నాగలక్ష్మికి గుండె శస్త్రచికిత్స చేయించారు. చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్న నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నారని తెలుసుకుని.. లాక్డౌన్ సమయంలో ప్రత్యేక అనుమతులు తీసుకొని గుంటూరు నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు మరో అభిమానికి చిరంజీవి అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న మెగా అభిమాని వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు లక్ష రూపాయల సాయం అందించారు. కడప జిల్లాకు చెందిన సీనియర్ మెగా అభిమాని పి.సురేష్ అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన కడప జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎనలేని సేవ చేశారు. మెగాస్టార్ అంటే ప్రాణం కన్నా మిన్నగా అభిమానించే ఆయన చిరంజీవి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం సురేష్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ కదిరిలో ఉంటున్నారు. చికిత్స నిమిత్తం ప్రతి రెండ్రోజులకు ఒకసారి కదిరి నుండి కడప, తిరుపతి వెళ్తూ వస్తున్నారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆర్థికంగా సతమతమవుతున్నారని తెలుసుకున్న చిరంజీవి.. సురేష్కి సాయం అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున పి.సురేష్కి వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. గురువారం మధ్యాహ్నం పి.సురేష్ అకౌంట్కు లక్ష రూపాయలను బదిలీ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jZXp7I
v
No comments:
Post a Comment