Monday, 22 February 2021

రకుల్ ప్రీత్ సింగ్‌ షూటింగ్‌లో ఉద్రిక్త వాతావరణం.. రాళ్లదాడితో సెక్యూరిటీకి గాయాలు .. ఊహించని ఘటన

టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి 'ఎటాక్' అనే సినిమాలో నటిస్తోంది. ధనీపూర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకోవడంతో అంతా షాకయ్యారు. కొందరు వ్యక్తులు సినిమా షూటింగ్‌పై రాళ్లదాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్యరాజ్ దర్శకత్వంలో 'ఎటాక్' సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రంలో జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 13వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అయిన యూనిట్.. శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. ఇందులో భాగంగా ధనీపూర్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. యాక్షన్ సీన్లలో భాగంగా బాంబు బ్లాస్టులు షూట్ చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్వరికీ దెబ్బలు, గాయాలు తగలకూడదని పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే షూటింగ్ చేస్తున్నారనే విషయం తెలిసి అక్కడికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. షూటింగ్ స్పాట్ వద్ద గేటు మూసేయడంతో సెట్ గోడ ఎక్కి షూటింగు చూడటానికి జనం ఎగబడ్డారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రజలు రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడగా.. హీరో జాన్ అబ్రహం, హీరోయిన్ రకుల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3keqigE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...