మెగా డాటర్, నాగబాబు కుమార్తె ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలైన సంగతి తెలిసిందే. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడిన ఆమె.. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయింది. సినిమాల పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆన్లైన్ వేదికలపై మాత్రం తన పోస్టులతో ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్లో తన విషయమై ఓ సీక్రెట్ ఉందని చెప్పి అందరిలో టెన్షన్ పుట్టించింది మెగా డాటర్. ''నాకు ఓ రహస్యం తెలుసు.. కానీ అది మీతో చెబితే రహస్యం ఎలా అవుతుంది చెప్పండి..? కాకపోతే నేను దాచిపెడుతున్న ఆ రహస్యమేంటో ఒక్క జోసెఫ్ రాధిక్కు మాత్రమే తెలుసు'' అంటూ తన ఇన్స్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది నిహారిక. జోసెఫ్ రాధిక్ ఎవరని ఆలోచిస్తున్నారా? నిహారిక- చైతన్య జొన్నలగడ్డ పెళ్లికి ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ ఆయనే. సెలబ్రిటీల ఫంక్షన్స్ కోసం ఫొటోస్ తీయడంలో ఈయన చాలా ఫేమస్ కూడా. చాలామంది టాలీవడ్, బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్ళకు ఈయన ఫోటోలు తీశాడు. అయితే ఇప్పుడు నిహారిక అతనొక్కడికే సీక్రెట్ తెలుసని చెబుతుండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక నిహారిక కెరీర్ విషయానికొస్తే.. వెండితెరపై హీరోయిన్గా స్టార్ స్టేటస్ పట్టేయకపోయినా నటనలో మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి లాంటి వెబ్ సిరీస్లలో నటించడమే గాక నిర్మించింది కూడా. ఇక పెళ్లి తర్వాత కూడా రీసెంట్గా మరో వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది నిహారిక. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నిహారికతో పాటు యాంకర్ అనసూయ కూడా ఇందులో భాగమవుతోంది. కీరవాణి సోదరుడు కల్యాణ్ మాలిక్ ఈ వెబ్ సిరీస్కు సంగీతం అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XQZ59l
v
No comments:
Post a Comment