ప్రతిభావంతులైన కొత్తవాళ్లను పరిచయం చేస్తూ సంయుక్త భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిస్తామని ఇటీవలే ప్రకటించిన చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు (జనవరి 1) తమ తొలి చిత్రం ''ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేశారు. 'కలర్ ఫొటో' సినిమాలో చేసిన అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు.షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్గా పరిచయమవుతుండగా.. అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్లో వర్థమాన రచయిత పద్మభూషణ్గా సుహాస్ కనిపిస్తున్నారు. ఆయన చేతిలో తను రాసిన తొలి పుస్తకం 'తొలి అడుగు' కనిపిస్తోంది. చూడ్డానికి సింపుల్గా ఉన్నా, సినిమా కాన్సెప్ట్పై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆకట్టుకుంటోంది ఈ పోస్టర్. త్వరలో షూటింగ్ మొదలుకానున్న 'రైటర్ పద్మభూషణ్'ను 2021 మధ్యలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి మ్యూజిక్ సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణమయ్యే చిత్రాల ద్వారా 2021లో మరి కొంతమంది ప్రతిభావంతులైన యువదర్శకులు పరిచయం కాబోతున్నారు. రానున్న కొద్ది వారాల్లో వాటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ రానున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MpXKnG
v
No comments:
Post a Comment