Tuesday, 19 January 2021

టాలీవుడ్ యంగ్ హీరోపై చీటింగ్ కేసు.. న్యాయం చేయాలని బాధితుల ఆవేదన!

టాలీవుడ్ యువ హీరో విశ్వంత్‌ దుద్దుంపూడిపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. విశ్వంత్ తమను నమ్మించి మోసం చేశాడని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు హీరోపై కేసు పెట్టారు. తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానంటూ తమ దగ్గర విశ్వంత్ డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే, విశ్వంత్ తమ వద్ద డబ్బు తీసుకొని కార్లు ఇప్పించలేదని వాపోయారు. డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. అతను తమను నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు విశ్వంత్‌పై కేసు నమోదు చేశారు. 2015లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన కేరింత అనే సినిమాలో సెకండ్ హీరోగా విశ్వంత్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమాలో మెయిన్ హీరో సుమంత్ అశ్విన్. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఓ పిట్టకథ సినిమాలోనూ విశ్వంత్ నటించాడు. విశ్వంత్ పూర్తి పేరు విశ్వనాథ్. కాకినాడలోని సామర్లకోట ఈయన జన్మస్థలం. పదో తరగతి వరకు విశాఖలో చదువుకొని, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాడు. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూరులో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విశ్వంత్‌కు దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మోహన్ లాల్, గౌతమి నటించిన మనమంతా సినిమాలో విశ్వంత్ నటించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ పిట్టకథ సినిమాలోనూ విశ్వంత్ నటించాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39Njz8x
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...