Thursday, 24 December 2020

థియేటర్ల రీ ఓపెన్.. ప్రభాస్ ఇంట్రస్టింగ్ కామెంట్

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్లన్ని తొమ్మిది నెలలుగా మూతపడిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ బిగ్ స్ర్కీన్‌పై సినిమా సందడి లేక థియేటర్లన్ని బోసిపోయాయి. అయితే కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇటీవల థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ సినిమా చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో చాలా సినిమాలు షూటింగ్ పూర్తయినా ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు నిర్మాతలు. మధ్యలో కొన్ని సినిమాలు ఓటీటీని నమ్ముకుని విడుదల చేయగా చాలా తక్కువ సంఖ్యలో హిట్ అయ్యాయి. అయితే డిసెంబర్‌లో ఒకట్రెండు సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ థియేటర్ల రీ ఓపెనింగ్‌పై కామెంట్‌ చేశారు. ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరారు. జనాలు సురక్షితంగా సినిమా చేసే అనుభవాన్ని అందించేందుకు సినిమాలు తిరిగి వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘మన సినిమాను బిగ్ స్క్రీన్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేద్దాం’ అని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవున్న పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా సుబ్బు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం క్రిస్మస్‌(డిసెంబర్‌ 25) రోజున థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్‌ చిరంజీవి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WHiqcz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...