Monday, 14 December 2020

‘డర్టీ హరి’ నిర్మాతపై పోలీసు కేసు.. స్త్రీలను అగౌరవపరిచారంటూ..!!

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్‌తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సెన్సార్ ఇబ్బంది లేకుండా ఈ మూవీని నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తు్న్నారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అప్పటికప్పుడు డబ్బు చెల్లించి ఈ యాప్ ద్వారా ‘డర్టీ హరి’ చూడొచ్చు. ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తమ సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఎం.ఎస్.రాజుతో పాటు హీరో శ్రవణ్ రెడ్డి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. రాజు ఇప్పటికే ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. శ్రవణ్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో హోల్డింగ్స్‌ను కూడా వాడుకుంటోంది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా మెట్రో పిల్లర్లపై తమ పోస్టర్లను ప్రదర్శిస్తోంది. అయితే, ఈ పోస్టర్లు ఇప్పుడు ‘డర్టీ హరి’కి చిక్కులు తెచ్చిపెట్టాయని సమాచారం. Also Read: హైదరాబాద్‌లోని వెంకటగిరి ఏరియాలో మెట్రో మిల్లర్ వద్ద ఏర్పాటుచేసిన పోస్టర్లు అసభ్యరంగా ఉన్నాయని భావించిన జూబ్లీ హిల్స్ పోలీసులు నిర్మాత గూడురు శివరామకృష్ణతో పాటు యాడ్ ఏజెన్సీపై సుమోటో కేసు నమోదు చేశారని తెలిసింది. ఈ పోస్టర్లు మహిళలను అగౌరవపరిచేలా, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని భావించి పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేసినట్టు సమాచారం. అయితే, ఈ విధంగా సినిమా పోస్టర్ల వల్ల నిర్మాతలపై కేసులు నమోదు కావడం కొత్తేమీ కాదు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా సమయంలోనూ ఇదే జరిగింది. కాగా, ‘డర్టీ హరి’ కన్నడ హిట్ మూవీ ‘ముంగరు మాలే’కు రీమేక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oRPQBn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...