హాలీవుడ్లో మొదలైన ‘మీ టూ’ ఉద్యమం.. మన దేశానికీ పాకి బాలీవుడ్తో పాటు ఇతర భాషల సినీ ఇండస్ట్రీని కూడా షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఎందరో ప్రముఖ నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి కూడా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై సంచలన ఆరోపణలు చేసింది. సినిమా అవకాశాల కోసం వెళ్లిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించడంతో పాటు అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కొద్ది నెలల క్రితం ఈ వ్యవహారం బాలీవుడ్లో పెను దుమారమే రేపింది. తాజాగా ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన పాయల్.. పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. కశ్యప్పై ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది.. అయినప్పటికీ పోలీసులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ట్విటర్ ద్వారా స్పందించింది. ‘నేను చనిపోతే గానీ ఈ కేసు ముందుకు కదలదా? అంటూ తీవ్రంగా స్పందించింది. పోలీసులు విచారణ సరిగ్గా చేయడం లేదు. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా, ఇది ఓ మహిళకు సంబంధించిన విషయం’ అంటూ పాయల్ ట్వీట్లో పేర్కొంది. ఆమె ట్వీట్పై ముంబయి పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38p1RI2
v
No comments:
Post a Comment