అక్కినేని కుటుంబంలోని నటులంతా కలిసి నటించిన ‘మనం’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అలాగే తన కుటుంబంలోని హీరోలంతా కలిసి ఓ సినిమా చేయాలన్నది ప్రముఖ నిర్మాత కలలు కనేవారు. అలాంటి సినిమా కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ ఏదీ ఆయనకు నచ్చలేదు. దీంతో తన కల నెరవేర్చుకోకుండానే ఆయన కాలం చేశారు. అయితే 2019లో మామా అల్లుళ్లు వెంకటేష్ - నాగచైతన్య కలిసి ‘వెంకీమామ’ చేశారు. కానీ కుటుంబ కథానాయకులంతా కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. Also Read: తాజాగా రామానాయుడు వారసుడు నిర్మాత డి.సురేష్బాబు తన తండ్రి కల నేర్చే పనిలో పడ్డారు. తమ కుటుంబ హీరోలకు తగిన కథ తీసుకొస్తే తాను సినిమా నిర్మిస్తానని చాలాసార్లు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వెంకటేష్, రానా, నాగచైతన్యలను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు వేగేశ్న సతీష్ ఓ కుటుంబ కథని సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఆ ముగ్గురు హీరోలు ఇంకా వినలేదట. అయినప్పటికీ ఈ సినిమా గురించి టాలీవుడ్లో అప్పుడే ప్రచారం ఊపందుకుంది. ‘శతమానం భవతి’ లాంటి కుటుంబ కథా చిత్రంతో జాతీయ పురస్కారం సొంతం చేసుకున్న సతీష్ వేగేశ్న ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’ అనే చిత్రం చేస్తున్నారు. అది పూర్తయ్యాక దగ్గుబాటి కుటుంబ కథానాయకుల సినిమా కోసం రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై దగ్గుబాటి కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KLks9l
v
No comments:
Post a Comment