ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ల లిస్ట్ చూస్తే పూజా హెగ్గే, కచ్చితంగా టాప్ -3లో ఉంటారు. వరుస విజయాలు సొంతం చేసుకుంటూ అగ్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్గా నిలుస్తూ ఈ ఇద్దరు భామలు జోరు మీదున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పూజా, ‘సరిలేరు నీకెవ్వరు’తో రష్మిక బ్లాక్బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నారు. పూజా ప్రస్తుతం తెలుగులో ‘రాధే శ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో నటిస్తుండగా, రష్మిక.. బన్నీ సరసన ‘పుష్ప’, శర్వానంద్తో కలిసి ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అసలు విషయానికొస్తే... ఈ అగ్ర హీరోయిన్లు ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించనున్నారట. ‘పడిపడి లేచె మనసు’ చిత్ర దర్శకుడు హనురాఘవపూడి.. దుల్కర్ సల్మాన్తో ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, రష్మికలను కథానాయికలుగా తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఈ ఇద్దర్నీ సంప్రదించగా వాళ్లు కూడా ఓకే చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33Zm3ik
v
No comments:
Post a Comment