Friday, 11 December 2020

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘డర్టీ పిక్చర్’ నటి అనుమానాస్పద మృతి

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస మరణాలు యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతున్నాయి. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్, ఆ తర్వాత కరోనాతో పలువురు సినీ నటుల మరణాలు, ఇక ఇటీవలే తమిళ నటి వీజే చిత్ర ఆత్మహత్య.. ఇలా వరుస ఘటనలు తీవ్ర విషాదంలో ముంచెత్తుతున్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ‘డర్టీ పిక్చర్’లో నటించిన నటీమణి (33) అనుమానాస్పద స్థితిలో మరణించింది. సౌత్ కోల్‌కతా, జోధ్‌పూర్ పార్క్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆర్య బెనర్జీ అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన పని మనిషి తలుపులు ఎంత కొట్టినా ఆమె తలుపులు తెరవకపోవడం, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే బెడ్‌పై ఆర్య శవమై కనిపించింది. ఆమె ముఖంపై ఉన్న గాయాలు, వాంతులు చేసుకున్న ఆనవాళ్లు లభించడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్య బెనర్జీని ఎవరైనా హత్య చేశారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యాబాలన్‌తో కలిసి 'డర్టీపిక్చర్‌'లో నటించిన ఆర్య బెనర్జీ.. ఇందులో షకీలా పాత్ర పోషించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m8Pu7D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...