Friday, 11 December 2020

బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రాకు పక్షవాతం.. కరోనా నుంచి కోలుకున్న కొద్దిరోజులకే

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నటి పక్షవాతానికి గురయ్యారు. శుక్రవారం ఆమె శరీరం కుడివైపు కాళ్లు, చేతులు తీవ్రంగా ప్రభావితం కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శిఖాకు నెల రోజుల క్రితం పక్షవాతం సోకడంతో హోమ్ ఐసోలేషన్లో ఉండి క్రమంగా కోలుకున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్న సమయంలోనే పక్షవాతం రావడం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ‘శిఖా మల్హోత్రాకు పక్షవాతం రావడంతో కుడివైపు శరీరం తీవ్రంగా ప్రభావితమైంది. ఆమెను విలేపార్లేలోని కూపర్ ఆసుపత్రిలో చేర్చాం’ అని ఆమె మేనేజరు అశ్వని శుక్లా తెలిపారు. శిఖా ప్రస్తుతం చికిత్స పొందుతోందని, కనీసం మాట్లాడలేకపోతోందని చెప్పారు. నర్సింగ్ కోర్సు చేసిన శిఖా లాక్‌డౌన్ సమయంలో కరోనా రోగులకు ఆరు నెలల పాటు స్వచ్ఛందంగా సేవలందించారు. ఈ క్రమంలోనే అక్టోబరులో ఆమెకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో కొద్దిరోజుల క్రితమే ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు పక్షవాతం రావడంతో ఉలిక్కి పడింది. శిఖా మల్హోత్రా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ‘ఫ్యాన్‌’ సినిమాలో నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KlVkVS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...