ప్రముఖ మరాఠి నటుడు రవి పట్వర్ధన్ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సారలు. మహారాష్ట్రలోని థానేలో ఉన్న తన నివాసంలో రవి పట్వర్ధన్ తుదిశ్వాస విడిచారు. పట్వర్ధన్ ఆ మధ్య ఒక మరాఠి సీరియల్లో నటించారు. కరోనా పరిస్థితుల్లో షూటింగ్ నుంచి విరామం తీసుకున్న రవి.. అనారోగ్యానికి గురయ్యారు. అయితే, రవి మళ్లీ కోలుకుని షూటింగ్లో పాల్గొంటారని ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, శనివారం రాత్రి రవి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ని హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. Also Read: రవి మృతికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎంఓ మహారాష్ట్ర ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. ‘‘తన అద్భుతమైన నటనతో ప్రతి పాత్రను ఒక జ్ఞాపకంగా మలిచిన నటుడిని మనం కోల్పోయాం. ప్రస్తుతం సినిమా, టీవీ పరిశ్రమల్లో నటులుగా రాణిస్తున్న ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఎన్నో మరపురాని పాత్రలను ఆయన మనకు అందించారు. నాటక, సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు’’ అని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. 80, 90ల్లో వచ్చిన ‘తేజాబ్’, ‘ప్రతిఘట్’, ‘అంకుశ్’ వంటి ఎన్నో సినిమాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, జడ్జిగా, గ్రామ పెద్దగా గొప్ప పాత్రలు పోషించారు రవి పట్వర్ధన్. దూరదర్శన్లో 90ల్లో ప్రసారమైన ‘అమ్చి మట్టి అమ్చి మనస’ అనే సిరీస్లో రవి గ్రామ పెద్ద పాత్ర పోషించారు. ఈ పాత్ర ప్రభావం మహారాష్ట్ర ప్రజలపై బాగా పడింది. ఈ సీరియల్ వచ్చిన తరవాత ‘పట్వర్ధన్’ అనే పేరును చాలా మంది మరాఠీలు తమ పిల్లలకు పెట్టుకున్నారు. ‘మహాభారత’ సీరియల్లోనూ ధృతరాష్ట్రుడి పాత్రను రవి పట్వర్ధన్ పోషించారు. పట్వర్ధన్కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39Nzrd6
v
No comments:
Post a Comment