Tuesday, 22 December 2020

17ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్‌తో బాలయ్య.. స్క్రిప్ట్ రెడీ చేసిన టాప్ రైటర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్‌ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు. ఫ్యాక్షన్ హీరోగా కనిపించినా, పవర్‌ఫుల్ పోలీసుగా విలన్ల తాట తీసినా ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరథం పడతారు. అలా బాలయ్య అన్ని కోణాల్లో చూపించిన దర్శకుడు . వీరి కాంబినేషన్లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు.. చిత్రాలు బాక్సాఫీసును షేక్ చేశాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘పలనాటి బ్రహ్మనాయుడు’తో ఇద్దరు పరువు పోయింది. Also Read: లాజిక్‌కు అందని సన్నివేశాలు, భారీ భారీ డైలాగులతో ఇద్దరు కలిసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. అప్పటి నుంచి బి.గోపాల్‌కు అవకాశాలు తగ్గడంతో ఆయన పూర్తిగా కనుమరుగైపోయారు. 2017లో గోపీచంద్‌తో ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా తీసినా అది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా జనాలకు తెలీదు. అయితే ఓ టైమ్‌లో ఇండస్ట్రీని ఏలిన బి.గోపాల్‌ వెండితెరపై మళ్లీ తన సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య సంప్రదించగా ఆయన ఓకే చెప్పేశారని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. రైటర్ సాయి మాధవ్ బుర్రా వీరి కాంబినేషన్ కోసం మంచి కథని రెడీ చేశారట. బాలకృష్ణ సూచనలతో కొన్ని మార్పులు చేసి పక్కా స్క్రిప్ట్ రెడీ చేశారట. బోయపాటితో సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని బి.గోపాల్‌కు బాలకృష్ణ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బోయపాటి సినిమా తర్వాత బాలకృష్ణ ఇద్దరు దర్శకులకు మాటిచ్చాడట. దీంతో అసలు బి.గోపాల్‌తో సినిమా అన్నది నిజమా? లేక ప్రచారమేనా? అన్నది సస్సెన్స్‌గా మారింది. ఒకవేళ నిజమే అయితే 17ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో మళ్లీ చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mAQXE4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...