కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ తెలుగు సినీ పరిశ్రమపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. నేటి నుండి థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని, పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు పరిమితి లేకుండా షోలు వేసుకోవడానికి థియేటర్లకు అనుమతులు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయం తెలియగానే ప్రముఖ నిర్మాత వెంటనే తన ప్లాన్ చేంజ్ చేసుకున్నారని సమాచారం. వకీల్ సాబ్ విడుదలపై దిల్ రాజు కొత్త వ్యూహం రచిస్తున్నారట. సంక్రాంతి సీజన్ వరకు థియేటర్ల విషయంలో స్పష్టత రాదనుకున్న దర్శకనిర్మాతలు తమ తమ సినిమాల విడుదలకు మర్చి లేదా ఏప్రిల్ నెలల్లో డేట్స్ ఫిక్స్ చేసుకుందామని భావించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీని కూడా ఏప్రిల్లో విడుదల చేయాలని అనుకున్నారు దిల్ రాజు. ఇంతలో కేసీఆర్ చేసిన ప్రకటనతో వకీల్ సాబ్ను సంక్రాంతి బరిలో దించాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు సరికొత్త ప్రణాళిక రూపొందిస్తున్నారని ఫిలిం నగర్ టాక్. Also Read: సాధారణంగా సంక్రాంతి సీజన్లో బడా హీరోల సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద మార్కెట్ కూడా. అందుకే వకీల్ సాబ్ మిగిలిన భాగాన్ని త్వరత్వరగా ఫినిష్ చేసి సంక్రాంతి బరిలో నిలపాలని ఇప్పటికే చిత్ర యూనిట్కి ఆదేశాలు పంపారట దిల్ రాజు. మరికొద్ది రోజుల్లో పవన్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఈ మూవీ విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారట. Also Read: బాలీవుడ్లో ఘన విజయం సాధించిన 'పింక్' సినిమాకు రీమేక్గా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్గా కనిపించనున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రంలో పవన్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pTWMPL
v
No comments:
Post a Comment