గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి మద్దతు ఇవ్వాలని నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధికి, చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమను కాపాడుతాననే మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటున్నారని కాదంబరి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన 40 వేల మంది సినీ కార్మికుల కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపిందని కాదంబరి కిరణ్ అన్నారు. అయితే చిత్ర పరిశ్రమకు కేటాయించే 1500 ఎకరాల్లో కొంత స్థలాన్ని కార్మికుల నివాసాల కోసం కేటాయించాలని సీఎం కేసీఆర్కు కాదంబరి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గులాబీ కండువా ధరించి ఆయన మీడియా ముందుకు వచ్చారు. Also Read: ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరవాత కేసీఆర్ చెప్పిన తొలి మాట సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటామని. ఆ ఒక్క మాట మాలో ఎంతో ధైర్యం నింపింది. ఆ మాటను నిజం చేస్తూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. సాయం కోరిన పేద వారికి, ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన వారికి అండగా ‘మనం సైతం’ సేవా సంస్థ ఉంటోంది. మా సంస్థకు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ నిత్యం సహకారం అందిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు’’ అని వెల్లడించారు. పేదలను ఆదుకునే ఎవరైనా తనకు దేవుళ్లేనని కాదంబరి కిరణ్ అన్నారు. ‘‘ఈ ప్రభుత్వం పేదలను ఆదుకుంటున్న తీరు చూసే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు ఓటేయ్యమని అందరి కంటే ముందుగా చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ‘మనం సైతం’ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం’’ అని కిరణ్ స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో మంచి పథకాలను రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. సినీ పరిశ్రమపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం అదృష్టంగా భావిస్తున్నామని కిరణ్ అన్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39bz4Zi
v
No comments:
Post a Comment