పవర్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘వకీల్ సాబ్’ షూటింగులో పాల్గొంటున్న ఆయన క్రిష్తో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం సరికొత్త లుక్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నట్లు టాక్. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతో మొదటి హీరోయిన్గా ‘సాహో’ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె కన్ఫార్మ్ చేసింది. Also Read: మరో హీరోయిన్ కోసం యూనిట్ జల్లెడ పడుతుండగా నిధి అగర్వాల్ పేరు బయటికి వచ్చింది. తాజాగా పేరు కూడా వినిపస్తోంది. జమీందారీ కుటుంబానికి చెందిన యువతి పాత్ర సినిమాకే హైలెట్ నిలుస్తుందని, అందువల్ల సాయిపల్లవి అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ చేయడానికి సాయిపల్లవి ఓకే చెప్పేసిందంటూ సోషల్మీడియా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nViOzI
v
No comments:
Post a Comment