యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా శాంటో దర్శకత్వంలో కొత్త చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నంద్కుమార్ అభినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వర్షా బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాతలు నంద్కుమార్ అభినేని, భరత్ మగులూరి మాట్లాడుతూ.. ‘‘రాజ్ తరుణ్తో మా బ్యానర్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శాంటో చెప్పిన కథ నచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని అన్నారు. దర్శకుడు శాంటో మాట్లాడుతూ.. ‘‘రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా ఇది. ఆయన్ని కొత్త యాంగిల్లో ప్రెజంట్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లా సినిమా ఉంటుంది. నిర్మాతలకు థాంక్స్. త్వరలోనే సెట్స్పైకి వెళతాం’’ అని చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అర్చనా రావ్ కాస్ట్యూమ్ డిజైనర్. శర్వణ్ కటికనేని ఎడిటర్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U1IOwJ
v
No comments:
Post a Comment