Thursday, 19 November 2020

యూట్యూబర్‌పై రూ.500కోట్ల పరువు నష్టం దావా వేసిన అక్షయ్

బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య కేసులో తనపై తప్పుడు ప్రచారాలు సృష్టించిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడికి షాకిచ్చారు హీరో అక్షయ్ కుమార్. ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బీహార్‌కు చెందిన రషీద్ సిద్దిఖీ అనే యూట్యూబర్‌పై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇదే కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేపై అసత్య ఆరోపణలు చేసినందుకు సిద్దిఖీని ముంబయి పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. తాజాగా అతడిపై ఏకంగా రూ.500కోట్లకు పరువు నష్టం దావా వేయడంతో ఈ కేసు మరోసారి వార్తల్లోకెక్కింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి కెనడా పారిపోవడానికి అక్షయ్ కుమార్ సహాయం చేశాడని సిద్దిఖీ ఎఫ్‌ఎఫ్ న్యూస్‌ పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానల్‌లో కథనాలు ప్రసారం చేశాడు. దీంతో పాటు సుశాంత్ మరణంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో అక్షయ్ రహస్య చర్చలు జరిపాడని ఆరోపించాడు. ఇలా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఫేక్ న్యూస్‌లు సృష్టించడం ద్వారా రషీద్ సిద్దిఖీ 4 నెలల్లోనే సుమారు రూ. 15 లక్షలకు పైగా సంపాదించినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ కేసులో మహారాష్ట్ర సర్కారుపై అసత్య కథనాలు ప్రసారం చేసినందుకు సిద్దిఖీపై గతంలోనే శివసేన లీగ్ సెల్‌కు చెందిన ధర్మేంద్ర మిశ్రా అనే లాయర్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం తన యూట్యూబ్‌ ఛానల్ ఆదాయం పెంచుకునేందుకే అతడి ప్రముఖులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రసారం చేసినట్లు వెల్లడైంది. మే నెలలో సిద్ధిఖీ యూట్యూబ్ వీడియోల ద్వారా రూ.296లు సంపాదిస్తే.. సెప్టెంబర్‌లో ఏకంగా రూ.6.5 లక్షలు సంపాదించడంతో పాటు 3.70 లక్షల సబ్‌స్క్రైబర్లను పెంచుకున్నాడని తెలిసింది. ఈ కేసులో సిద్దిఖీకి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని అతడిని ఆదేశించింది. తాజాగా సిద్దిఖీపై అక్షయ్ పరువు నష్టం దావా వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36OCzCo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...