Saturday, 28 November 2020

ఓటీటీలోకి విజయ్ ‘మాస్టర్’... రూ.100కోట్లతో డీల్!

తమిళ స్టార్ హీరో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి సినిమా వచ్చిదంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి విజయాలు సాధిస్తూ వందల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. దీంతో ఇప్పడు కోలీవుడ్‌లో అందరి దృష్టి ‘’పైనే ఉంది. ‘ఖైదీ’తో ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ డైరెక్టర్‌ కావడంతో ‘మాస్టర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డలు సృష్టిస్తోంది. రెండు వారాల్లోనే 40 మిలియన్ వ్యూస్ సాధించింది. 24 గంటల్లోనే 2 మిలియన్ల లైకులతో సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. Also Read: ‘మాస్టర్’ లాంటి భారీ బడ్జెట్‌ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, ఓటీటీ వైపు వెళ్లే ఆలోచన లేదని నిర్మాతలు గతంలోనూ ప్రకటించారు. తమిళనాడు థియేటర్స్‌ యజమానుల సంఘం సైతం విజయ్‌ సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించింది. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ‘మాస్టర్‌’ ఏకంగా రూ.100కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి అంత బాగోలేదు. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరిచినా ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం లేదు. అందుకే దర్శక నిర్మాతలు మనసు మార్చుకుని ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ ఇంకా స్పందించలేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌‌గా నటించారు. మాళవికా మోహనన్ హీరోయిన్. ఆండ్రియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు విజయ్ తన 65వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రం ‘మాస్టర్’ రిలీజ్ అనంతరం సెట్స్‌పైకి వెళ్లనుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36euJCG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...