Monday, 5 October 2020

చనిపోయిన భర్త కటౌట్ పెట్టుకుని సీమంతం.. భావోద్వేగానికి గురైన నటి

కొద్ది నెలల క్రితం ఆకస్మికంగా కన్నుమూసిన కన్నడ నటుడు సతీమణి మేఘన సీమంతం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. భర్త జ్ఞాపకాలతో బ్రతుకుతున్న మేఘన... చిరంజీవి స్టైల్‌గా నుంచున్నట్లు కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. దూరం నుంచి చూస్తే చిరంజీవి నిజంగానే భార్య పక్కను నిలబడినట్లు ఉండటంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మేఘన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈసందర్భంగా ‘నాకెంతో ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు. చిరు.. నువ్వు ఇలాగే కదా ఈ వేడుక జరగాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది. ఇకపైనా జరుగుతుంది. ఐ లవ్‌ యూ బేబీ మా’ అని పేర్కొన్నారు. మేఘన షేర్‌ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు. ‘చిరంజీవి కటౌట్‌ చూస్తుంటే‌ ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Also Read: తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన అర్జున్ మేనల్లుడే చిరంజీవి సర్జా. కన్నడలో సుమారు 22 సినిమాల్లో నటించిన ఆయన నటి మేఘనారాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఛాతీ నొప్పితో ఇంట్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే మేఘన గర్భవతిగా ఉన్నారు. తన భర్త సజీవంగా లేకపోయినా... ఆయన జ్ఞాపకాలు జీవితాంతం తనతోనే ఉంటాయని మేఘన పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33y4buM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...