మెగాస్టార్ చిరంజీవి, కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతే. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ని అల్లు అరవింద్ నిర్మించాలనుకున్నారట. అయితే అరవింద్పై నమ్మకం లేక రామ్చరణ్ అప్పటికప్పుడు బ్యానర్ ఏర్పాటు చేసిన తండ్రి సినిమాను స్వయంగా నిర్మించాడు. ఆ తర్వాత ‘సైరా’కు కూడా అరవింద్కు మెగా ఫ్యామిలీ ఛాన్స్ ఇవ్వలేదు. తాజాగా ‘ఆచార్య’ సినిమాను తాను నిర్మిస్తానని అల్లు అరవింద్ ముందుకొచ్చినా పట్టించుకోలేదని ఇండస్ట్రీలో టాక్. చిరంజీవి చేయబోతే నెక్ట్స్ మూడు సినిమాలకు అల్లు అరవింద్ను లైట్ తీసుకోవడంతో రెండు కుటుంబాల మధ్య తేడా కొట్టిందని పలువురు అనుమానిస్తున్నారు. రామ్చరణ్ సినిమాలకు సంబంధించి కథలు వినే బాధ్యతను చిరు.. అరవింద్కు అప్పగించారంట. అయితే మంచి కథలను ఆయన బన్నీకి రిఫర్ చేసి చరణ్ను మోసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చిరు అరవింద్పై మండిపడినట్లు టాక్. ఈ కారణంతోనే ఇటీవల గండిపేటలో అల్లు స్టుడియోస్ పేరిట ఆ ప్యామిలీ నిర్మిస్తున్న స్టుడియో శంకుస్థాపనకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ హాజరు కాలేదట. Also Read: అల్లు స్టుడియోకి పోటీగా మెగా ఫ్యామిలీ కూడా స్టుడియో ఫ్లోర్లను నియమించాలనుకోవడంతో ఒకే బిజినెస్లో రెండు ఫ్యామిలీలు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆహా యాప్కు పోటీగా రామ్చరణ్, సుస్మిత కలిసి మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. కొణిదెల, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరుగుతోందని అనడానికి ఇదే నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలు నిజమా? రూమర్సా? అన్నది తెలియాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37kYd32
v
No comments:
Post a Comment