Sunday, 11 October 2020

‘సర్కారు వారి పాట’ మరింత ఆలస్యం.. సంక్రాంతి తరవాతే అంటోన్న మహేష్!

‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్‌తో సూపర్ స్టార్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సూపర్ హిట్ తరవాత మహేష్ నటిస్తోన్న సినిమా కావడం, ‘గీత గోవిందం’ తరవాత పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం కావడంతో ‘సర్కారు వారి పాట’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా సుమారు ఐదు నెలలు ఇంటికే పరిమితమైన మహేష్ బాబు ఇటీవల ఒక యాడ్ షూట్ కోసం బయటికి వచ్చారు. దీంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కూడా త్వరలో మొదలైపోతుందని అంతా భావించారు. దీనికి తోడు పరశురామ్ అండ్ టీమ్ కూడా లొకేషన్స్ చూడటానికి అమెరికా వెళ్లారు. అక్కడ 45 రోజుల షూట్‌ను ప్లాన్ చేయడంతో లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇదంతా చూసి ఇక త్వరలో సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ, షూటింగ్ మరింత ఆలస్యమవ్వబోతోందని సమాచారం. Also Read: ప్రస్తుతం షూటింగ్‌ను ప్రారంభించేందుకు మహేష్ రెడీగా లేరని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సంక్రాంతి తరవాత షూటింగ్‌ను మొదలుపెడదామని మేకర్స్‌కు మహేష్ బాబు సూచించారట. కరోనా పరిస్థితులు ఇంకా పూర్తిగా చక్కబడకపోవడంతో పాటు గత నెల రోజులుగా సాగుతున్న వీసా ప్రక్రియకు మరింత సమయం పట్టే పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ ఇది కచ్చితంగా మహేష్ అభిమానులకు నిరాశ కలిగించే వార్తే. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30UHXBK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...