యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన విచారించగా డ్రగ్స్ కోణం బయటపడింది. మరోవైపు నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడంటూ స్టార్ కిడ్స్ను సోషల్మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా బాలీవుడ్లో వరుస వివాదాలు చెలరేగుతున్న అక్షయ్కుమార్ తప్ప ఇంకెవరూ నోరు మెదపడం లేదు. దీంతో ఇక పని అయిపోయినట్లే అంటూ వార్తలు వస్తున్న తరుణంలో తిరుగుబాటు మొదలైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. Also Read: బాలీవుడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్.. బ్రేకింగ్ అంటూ చేసిన ట్వీట్ చూస్తుంటే బాలీవుడ్ పరువు నిలబెట్టేందుకు సెలబ్రెటీలందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోంది. నాలుగు అసోషియేషన్స్, 34 బడా నిర్మాణ సంస్థలు కలిసి బాలీవుడ్పై దుమ్మెత్తిపోస్తున్న మీడియా సంస్థలను నివారించడానికి దావా వేశారు. బాధ్యతారాహిత్యంగా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న రెండు జాతీయ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆమీర్ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, కరణ్ జోహార్, అదిత్య చోప్రా, ఫర్హాన్ అక్తర్ తదితరులు ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. ఈ విషయాన్ని బాలీవుడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇన్ని రోజులుగా నోరు మెదపకుండా ఉన్న స్టార్లందరూ ఇప్పుడు ఒక్కటై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. సినీ పరిశ్రమ ప్రేక్షకుల ఆదరాభిమానాల మీదే ఆధారపడి ఉందని, ప్రజల్లో బాలీవుడ్పై అసహ్యం కలిగించేలా మీడియా కథనాలు ప్రసారం చేయడం సరికాదని సెలబ్రెటీలు మండిపడుతున్నారు. ఎందరో కార్మికులు, టెక్నీషియన్స్ దీనిపై ఆధారపడి బ్రతుకుతున్నారని, అసలే కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమ ఇలాంటి వివాదాలతో మరింత కష్టాల్లో పడుతోందంటున్నారు. బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ వినియోగిస్తోందన్న భ్రమ కలిగేలా అసత్య కథనాలు ప్రసారం చేయడం సరికాదని నిర్మాతలు మండిపడుతున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lK9j5h
v
No comments:
Post a Comment