కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఏడు నెలలుగా సినిమా థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్ఫాంలే హోం థియేటర్లుగా మారాయి. సినీ ప్రేమికులు ఈ ఓటీటీ ప్లాట్ఫాంల ద్వారా కేవలం తెలుగు భాషా చిత్రాలు మాత్రమే కాకుండా పరభాషా చిత్రాలను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధమై థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అంటూ ఎదురుచూస్తున్న సినిమాలను పలు ఓటీటీ సంస్థలు పోటీపడి కొనుగోలు చేసి నేరుగా విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఇలా చాలా సినిమాలు నేరుగా ఓటీటీ ప్లాట్ఫాంలలో విడుదలయ్యాయి. అలాగే, ఆయా ఓటీటీ ప్లాట్ఫాంలు సొంతంగా వెబ్ మూవీస్ను, సిరీస్లను రూపొందిస్తున్నాయి. తాజాగా ఈ కోవలోకి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీ+ హాట్స్టార్ కూడా చేరింది. ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లిష్ వెబ్ సిరీస్లను మాత్రమే అందించిన హాట్స్టార్ ఇప్పుడు సౌత్ లాంగ్వేజెస్లోకి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం నాలుగు సిరీస్లను ప్రకటించింది. వీటిలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో అగర్వాల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’, సత్యరాజ్, సీత నటించిన ‘మై పర్ఫెక్ట్ హస్బెండ్’, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో జై సంపత్, వాణి భోజన్ నటించిన ‘ట్రిపుల్స్’, మిల్కీ బ్యూటీ భాటియా నటించిన ‘నవంబర్ స్టోరీ’ ఉన్నాయి. అయితే, ఈ నాలుగూ తమిళ సిరీస్లే. వీటిని తెలుగులోకి అనువాదం చేసి అందుబాటులోకి తెస్తున్నారు. డిస్నీ+ హాట్స్టార్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది. హాలీవుడ్ సంస్థ డిస్నీ నిర్మించిన సూపర్ హీరోస్, యానిమేషన్ సినిమాలు అన్నీ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఐపీఎల్ మ్యాచ్లు లైవ్ టెలీకాస్ట్ అవుతున్నాయి. స్టార్ మా ఛానెల్లో వచ్చే వీడియో కంటెంట్ మొత్తం ఈ ఓటీటీ ప్లాట్ఫాంలో దొరుకుతుంది. ఇప్పుడు కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు నటించిన సినిమాలను ఎక్స్క్లూజివ్గా హాట్స్టార్ తమ ప్రేక్షకులకు అందిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34mnQyd
v
No comments:
Post a Comment